Vijay Devarakonda: గ్రాండ్ ఈవెంట్కి చెప్పులతో హాజరైన విజయ్.. రణ్వీర్ ఏమన్నారంటే
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)-పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ కథా చిత్రం ‘లైగర్’ (Liger). ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం...
ముంబయి: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)-పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ కథా చిత్రం ‘లైగర్’ (Liger). ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్, సాయంత్రం ముంబయిలో ఎంతో వేడుకగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈవెంట్లో బీటౌన్ నటుడు రణ్వీర్ సింగ్(Ranveer Singh) ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే.. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ చాలా సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్, చెప్పులు వేసుకుని హాజరయ్యారు. ఈ విషయాన్ని గమనించిన రణ్వీర్ సింగ్ ఆయన స్టైల్ని మెచ్చుకుంటూ.. ‘‘ఇలాంటి గ్రాండ్ ఈవెంట్కు విజయ్ చెప్పులు వేసుకుని వచ్చారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి నేను వచ్చినట్లు లేదు. నా సినిమా ట్రైలర్ లాంచ్కి ఆయన హాజరైనట్లు ఉంది. ఏది ఏమైనా చెప్పులు వేసుకున్నప్పటికీ ఆయన స్టైల్ అదిరింది’’ అని ప్రశంసించారు.
నత్తితో ఇబ్బందిపడ్డా..!
‘‘ఈ సినిమాలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. లుక్స్ పరంగా చూస్తే వందమందితో ఒకేసారి పోరాటం చేయగలిగేలా కనిపిస్తా. కానీ, తడబడకుండా ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పలేను. ఎందుకంటే ఇందులో నా పాత్రకు నత్తి ఉంటుంది. నత్తిగా మాట్లాడటానికి మొదటి మూడు రోజులు చాలా కష్టపడ్డా. ఒక్కసారి మాట్లాడటం అలవాటయ్యాక ఫుల్ ఎంజాయ్ చేశా’’ అని విజయ్ వివరించారు.
ఒక్కసారికి ఒక్కటే..!
‘‘ఒకేసారి మల్టీటాస్కులు చేయడం నా వల్ల కాదు. అలా చేస్తే గందరగోళానికి గురవుతా. అందుకే ఒక సమయంలో ఒక సినిమానే ప్రశాంతంగా పూర్తి చేస్తున్నా. అదే నా సామర్థ్యం’’
అమ్మ పూజలు..!
‘‘ఈ సినిమాలో మైక్టైసన్తో నాకు పోరాట సన్నివేశాలుంటాయి. ఆ విషయం తెలిసి మా అమ్మ కంగారు పడ్డారు. ఆ సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు నాకోసం ఆమె పూజలు చేసింది. ఆ పూజలు ఫలించడం వల్లే ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నా’’ అని విజయ్ చెప్పగానే మధ్యలో ఛార్మి అందుకుని.. ‘‘మైక్టైసన్తో షూట్ అనుకున్నప్పుడు విజయ్ వాళ్లమ్మ నన్ను పిలిచి.. ‘‘మా చిన్నుని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నది మైక్టైసన్ అని చెప్పారు’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం