మరో బాలీవుడ్‌ చిత్రానికి రష్మిక గ్రీన్‌ సిగ్నల్‌

‘ఛలో’చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిన భామ రష్మిక మందన. తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’లో మరింత క్యూట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Published : 27 Apr 2021 20:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న భామ రష్మిక మందన. తన చిరునవ్వుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’లో మరింత క్యూట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. అయితే, కథేంటి? దర్శకుడు ఎవరు? హీరో ఎవరు? అన్న వివరాలు మాత్రం చెప్పలేదు.

రష్మిక - సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న ‘మిషన్‌ మజ్ను’ అనే చిత్రంతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న ‘గుడ్‌బై’ హిందీలో రెండో చిత్రం. హీరో కార్తీతో కలిసి ‘సుల్తాన్‌’ సినిమాతో తమిళ తంబీలను ఆకట్టుకుంది. ఇటీవలే సినిమా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని