19ఏళ్ల తర్వాత స్టార్‌హీరో భార్య రీఎంట్రీ?

దాదాపు రెండు దశబ్దాల తర్వాత ఓ స్టార్‌హీరో సతీమణి వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. బాలనటిగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘సఖి’తో కథానాయికగా సినీప్రియుల్ని అలరించిన నటి షాలినీ....

Published : 13 Feb 2021 16:07 IST

స్టార్‌ డైరెక్టర్‌ మూవీలో కీ రోల్‌

చెన్నై: దాదాపు రెండు దశబ్దాల తర్వాత ఓ స్టార్‌హీరో సతీమణి వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బాలనటిగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుని ‘సఖి’తో కథానాయికగా సినీప్రియుల్ని అలరించిన నటి షాలినీ. కథానాయికగా రాణిస్తున్న తరుణంలో హీరో అజిత్‌ను ప్రేమ వివాహం చేసుకుని కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్‌’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు.

కాగా, షాలినీ మరోసారి వెండితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కథానాయికగా ఆమెకు బ్రేక్‌ ఇచ్చిన మణిరత్నం చిత్రంతోనే ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు త్రిష, కార్తి, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌‌’లో షాలినీ ఓ కీలకపాత్ర పోషించనున్నారని గత కొన్నిరోజులుగా వరుస కథనాలు వస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్‌లో షాలినీ త్వరలోనే భాగం కానున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చదవండి

రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని