Dastagiri: పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు

పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి వైకాపా నాయకులతో చేతులు కలిపారని, తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Published : 08 May 2024 21:13 IST

పులివెందుల: పులివెందుల సీఐ శంకర్‌రెడ్డి వైకాపా నాయకులతో చేతులు కలిపారని, తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని వివేకా హత్యకేసులో అప్రూవర్‌ దస్తగిరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జైభీమ్‌రావు పార్టీ తరఫున పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోన్న దస్తగిరి ప్రచార రథపై మూడు రోజుల క్రితం వైకాపా శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ శంకర్‌రెడ్డి హస్తముందని ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వైకాపా నాయకులు చెప్పినట్టు తనను బెదిరిస్తున్నారని దస్తగిరి వాపోయారు. ప్రచార రథంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా, తనకే 41 నోటీసు అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని