Mahesh Babu: దుబాయ్‌లో చర్చలు

మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కనున్న సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్‌తోపాటు సంగీత దర్శకుడు

Updated : 28 Dec 2021 06:04 IST

హేష్‌బాబు(Mahesh Babu) - త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కనున్న సినిమా(SSMB28) గురించి చర్చలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్‌తోపాటు సంగీత దర్శకుడు తమన్‌, నిర్మాత సూర్య దేవర నాగవంశీ దుబాయ్‌లో భేటీ అయ్యారు. ఆ విషయాన్ని మహేష్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సంగీతంతోపాటు చిత్రీకరణకి సంబంధించి చర్చలు సాగించినట్టు సమాచారం. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న సినిమా ఇది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. మహేష్‌ 28వ సినిమాగా పట్టాలెక్కనున్న ఈ చిత్రం కోసం కథానాయికగా పూజాహెగ్డేని ఎంపిక చేశారు. చాలా రోజుల కిందటే ఈ సినిమాని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని