Nene Naa: ‘దెయ్యానికి వేలి ముద్రలు ఎలా వచ్చాయి’ ..

రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నేనే నా’ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

Updated : 14 Sep 2021 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన కెరీర్‌ ప్రారంభం నుంచీ వైవిధ్య కథల్ని ఎంపిక చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రెజీనా. ఆ పంథాలోనే ఇప్పుడామె నటిస్తోన్న చిత్రం ‘నేనే నా’. కార్తీక్‌ రాజు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మిగతా కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే నటులు విశాల్‌, అరుణ్‌ విజయ్‌, నిధి అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ ఓ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఓ అడవిలో జరిగే హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌, ఆర్కియాలజిస్ట్‌ అయిన రెజీనా పోలీసు అధికారులకి సాయం చేయడం తదితర సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. రెజీనా నటన విశేషంగా ఆకట్టుకునే విధంగా ఉంది. విభిన్న గెటప్పుల్లో వైవిధ్యం ప్రదర్శించింది. ‘100 సంవత్సరాల క్రితం జరిగిన ఓ భయంకరమైన సంఘటన మళ్లీ ఇప్పుడు జరుగుతుందంటే నమ్మలేకపోతున్నా’, ‘దెయ్యానికి వేలి ముద్రలు ఎలా వచ్చాయి’ అనే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచింది. ఈ చిత్రంలో అక్షర గౌడ, వెన్నెల కిశోర్‌, తాగుబోతు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్‌ శేఖర్‌ వర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్‌ సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని