Nene Naa: ‘దెయ్యానికి వేలి ముద్రలు ఎలా వచ్చాయి’ ..
రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నేనే నా’ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: తన కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్య కథల్ని ఎంపిక చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రెజీనా. ఆ పంథాలోనే ఇప్పుడామె నటిస్తోన్న చిత్రం ‘నేనే నా’. కార్తీక్ రాజు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మిగతా కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే నటులు విశాల్, అరుణ్ విజయ్, నిధి అగర్వాల్, సందీప్ కిషన్ తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రైలర్ని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ఓ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఓ అడవిలో జరిగే హత్యలు, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఆర్కియాలజిస్ట్ అయిన రెజీనా పోలీసు అధికారులకి సాయం చేయడం తదితర సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. రెజీనా నటన విశేషంగా ఆకట్టుకునే విధంగా ఉంది. విభిన్న గెటప్పుల్లో వైవిధ్యం ప్రదర్శించింది. ‘100 సంవత్సరాల క్రితం జరిగిన ఓ భయంకరమైన సంఘటన మళ్లీ ఇప్పుడు జరుగుతుందంటే నమ్మలేకపోతున్నా’, ‘దెయ్యానికి వేలి ముద్రలు ఎలా వచ్చాయి’ అనే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచింది. ఈ చిత్రంలో అక్షర గౌడ, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..