Nithiin: పట్టాలెక్కనున్న వంశీ చిత్రం

హీరో నితిన్‌ ‘చెక్‌’, ‘రంగ్‌ దే’వంటి చిత్రాలతో కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా సెట్స్‌పై ఉండగానే ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం

Updated : 03 Jun 2021 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: హీరో నితిన్‌ ఈ ఏడాదిలో ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ వంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా సెట్స్‌పై ఉండగానే ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఈ చిత్రాన్ని ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. ఆగస్టులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పుకుంటున్నారు. ‘‘రొమాంటిక్‌ కామెడీ సన్నీవేశాలతో పాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా చిత్రం ఉంటుందట. ఇందులో నితిన్‌ పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందనే వార్తలొస్తున్నాయి. చిత్రంలో నటీనటులు సాంకేతిక సిబ్బంది ఎవరనేది ఇంకా తెలియదు. ప్రస్తుతం ఉన్న కరోనా-19 రెండోదశ తగ్గగానే సినిమాకి సంబంధించిన ఇతర తారాగణాన్ని ఎంపిక చేయనున్నారు. నితిన్‌ ఇప్పటికే ‘పవర్‌ పేట’ అనే సినిమాకు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని