బన్నీ -ప్రశాంత్‌ల చిత్రం అప్పుడేనా?

అల్లు అర్జున్‌ ప్రేమకథా చిత్రాలతో పాటు మాస్‌ యాక్షన్‌ చిత్రాల్లోనూ మెప్పించగలడు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఎర్రచందనం స్మగర్‌గా కనిపించనున్నారని సమాచారం. రష్మక మందన కథానాయికగా నటిస్తోంది.

Published : 24 Apr 2021 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అల్లు అర్జున్‌ ప్రేమకథా చిత్రాలతో పాటు మాస్‌ యాక్షన్‌ చిత్రాల్లోనూ మెప్పించగలడు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఎర్రచందనం స్మగర్‌గా కనిపించనున్నాడు. రష్మక మందన కథానాయికగా నటిస్తోంది. సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం తర్వాత ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రశాంత్‌ ప్రస్తుతం ‘కె.జి.యఫ్‌2’తో పాటు ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’ని తెరకెక్కిస్తున్నారు. చిత్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ వెంటనే జనవరిలోనే అల్లు సినిమాని ప్రశాంత్‌ పట్టాలెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. ఆ మధ్య ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్‌ని కలిసిన సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌ - కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. కానీ, అది తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక ‘వకీల్‌సాబ్‌’ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ చేస్తున్నట్లు గతేడాదిలో ప్రకటించారు. కానీ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇటీవల ఈ సినిమాని ప్రారంభించనున్నట్లు దిల్‌రాజు మీడియా ముందే ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని