
Updated : 29 Jan 2021 10:01 IST
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 28 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు ఈ షరతులు వర్తించవని వెల్లడించింది.
Tags :