’చూస్తూ కూర్చోవద్దు.. కేంద్రం ఏదైనా చేయాలి’
పంట వ్యర్థాల దహనంతో ఏర్పడుతున్న కాలుష్యంతో ఒక్క దిల్లీ నగరానికే కాదు.. యావత్ ఉత్తర భారతదేశానికే పెద్ద సమస్యగా మారిందని ......
కాలుష్య సమస్యపై సిసోడియా విజ్ఞప్తి
దిల్లీ: పంట వ్యర్థాల దహనంతో ఏర్పడుతున్న కాలుష్యం ఒక్క దిల్లీ నగరానికే కాదు.. యావత్ ఉత్తర భారతదేశానికే పెద్ద సమస్యగా మారిందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ఎప్పటినుంచో పనిచేస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారంలో కేంద్రం తీరు దురదృష్టకరమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఏమీ చేయడంలేదని, ఏడాదిగా కూర్చుని చూస్తోందని ఆరోపించారు. ఈ సమస్యతో మొత్తం ఈశాన్య భారతం బాధపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించడంలో తనదైన పాత్ర పోషించాలని, అలాగే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు బాధ్యతతో పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. కాలుష్యంతో కూడిన ఓవైపు కాలుష్యం.. మరోవైపు కరోనా వైరస్ ప్రజలకు ప్రాణాంతకంగా మారాయని సిసోడియా ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.