ఆ బాధితురాలు ఎవరికీ ఏమీ కాదు?
దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హాథ్రస్ హత్యాచార ఘటనను ఉద్దేశించి నేడు..........
హాథ్రస్ ఘటనను ఉద్దేశించి ఆదిత్యనాథ్పై రాహుల్ విమర్శలు
లఖ్నవూ: దళితులు, ముస్లింలు, ఆదివాసీలను దేశంలో చాలా మంది మనుషులుగా పరిగణించడం లేదని.. ఇది సిగ్గుపడాల్సిన వాస్తవమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హాథ్రస్ హత్యాచార ఘటనను ఉద్దేశించి తాజాగా ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు గుప్పించారు. ఎవరూ అత్యాచారానికి గురికాలేదని యూపీ సీఎం, అక్కడి పోలీసులు పదే పదే అంటున్నారని ఆరోపించారు. అంటే ఆ బాధితురాలు వారికి ‘ఎవరూ కాదు’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా వారు ఆమెను లేక్కే చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘బాధితురాలు చెప్పినా పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు అంటున్నారు’ అన్న కోణంలో బీబీసీలో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని ట్వీట్కు జత చేశారు.
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై యూపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. బాధిత కుటుంబాన్ని గతవారం రాహుల్ గాంధీ సహా ఆయన సోదరి ప్రియాంక గాంధీ పరామర్శించారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.