తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ
తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీతో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల విజయాలను వర్ణిస్తూ భాజపా కార్యకర్తలు బస్టాండ్ వద్ద ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. ఫలితంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద..
గొల్లపల్లి: తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీతో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల విజయాలను వర్ణిస్తూ భాజపా కార్యకర్తలు బస్టాండ్ వద్ద ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. ఫలితంగా ఎంపీడీవో కార్యాలయం వద్ద భాజపా కార్యకర్తలు మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
స్థానిక ఆర్యవైశ్యభవన్లో బుధవారం జరిగే ఓ కార్యక్రమానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరవుతున్నట్లు తెలుసుకున్న భాజపా కార్యకర్తలు.. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నం అంజయ్య ఆధ్వర్యంలో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంఘ్ భవన్కు చేరుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భాజపా కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డకున్నారు. తెరాస నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎస్సై జీవన్ ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని శాంతిపజేశారు. స్థానిక భాజపా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసినా తోపులాట జరగడం గమనార్హం.
ఇవీ చదవండి..
భార్య ఫొటోలు పెట్టి.. కాల్ గర్ల్గా చిత్రీకరించి..
కొవిడ్ టీకా త్వరగా ఇప్పిస్తామంటూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.