YSRCP: వైకాపాలో వర్గపోరు.. మంత్రి అంబటికి వ్యతిరేకంగా సర్పంచ్‌ల సమావేశం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపాలో వర్గ విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పలువురు నేతలు సమావేశమయ్యారు.

Published : 19 Jul 2023 18:11 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపాలో వర్గ విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పలువురు నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన అసమ్మతి నేతలు తాజాగా ఇవాళ వైకాపా నేత చిట్టా విజయభాస్కర్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. 11 మంది సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి అంబటి తమను పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో అంబటి అనుచరుల పెత్తనం పెరిగిందని, స్థానిక ప్రజాప్రతినిధులమైన తమను విస్మరించి కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదైనా ప్రజా సమస్యపై మంత్రిని కలవాలని ప్రయత్నించినా కుదరటం లేదన్నారు. రెండు రోజుల్లో మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని