Amit Shah: గుజరాత్ ఫలితాల్లో.. AAP పేరే కన్పించదు: అమిత్ షా కౌంటర్
గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమకు పోటీనే కాదని అమిత్ షా అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఖాతా తెరిచే అవకాశమే లేదన్నారు.
అహ్మాదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న సవాల్ను భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడూ కొట్టిపడేస్తూనే ఉంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ పార్టీ గుజరాత్లో కనీసం ఖాతా తెరిచే అవకాశం లేదన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ పేరు కూడా కన్పించదంటూ ఎద్దేవా చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా.. పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశం గురించి ప్రశ్నించగా.. ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. అయితే ఆ పార్టీని ఆమోదించాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. బడ్జెట్కు మించిన హామీలు కురిపిస్తే అవి నెరవేర్చలేరని ప్రజలకు కూడా తెలుసన్నారు. ‘‘గుజరాత్ ప్రజల ఆలోచనల్లో ఆప్ అనేదే లేదు. ఎన్నికల ఫలితాలు వరకు ఎదురుచూడండి. గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ పేరే కన్పించదు’’ అంటూ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఇదీ చదవండి: ‘ఆప్’ కౌన్ హై?
కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి..
తమకు ఇంకా కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి అని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, గుజరాత్ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కన్పిస్తుందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను అమిత్ షా ఖండించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్ర, తటస్థ సంస్థలని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధిస్తుందని హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
గుజరాత్ తొలి దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. గురువారం (డిసెంబరు 1) పోలింగ్ జరగనుంది. డిసెంబరు 5న రెండో విడత పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 8న ఫలితాలను ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?