Purandeswari: భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి

టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు.

Updated : 18 Dec 2023 15:06 IST

మన్యం: టిడ్కో గృహాల నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల వద్ద టిడ్కో గృహాలను ఆమె పరిశీలించారు. జిల్లాలో ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు అందలేదని విమర్శించారు.  ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ప్రజలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం జరగలేదని.. ల్యాండ్‌, శాండ్‌, మద్యం పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని పురందేశ్వరి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని