ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలి:సోము

ఏపీలో కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు.

Published : 22 Apr 2021 01:30 IST

అమరావతి: ఏపీలో కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థులు పరీక్షలకు ప్రజా రవాణా ద్వారానే రావాల్సి ఉంటుందని వివరించారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అందువల్ల పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నానన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాధిగ్రస్తుల చికిత్స, ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.

కొందరు లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలుపులేకపోతున్నారని.. రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోము వీర్రాజు అన్నారు. కొవిడ్‌ వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్‌ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని లేఖలో సోము కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని