Botsa: చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతి ఎందుకు రాలేదు?: బొత్స

తానెవరినీ విమర్శించలేదని.. ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు

Updated : 08 Mar 2022 15:58 IST

విజయనగరం: తానెవరినీ విమర్శించలేదని.. ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని..  సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. 

‘‘చంద్రబాబు హైదరాబాద్‌లో ఎందుకున్నారు? అమరావతికి ఎందుకు రాలేకపోయారు? అమరావతి అడ్రస్‌ లేకుండా ఐదేళ్లు సీఎంగా పాలించడం దురదృష్టకరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్‌ విషయాన్ని ప్రస్తావించాను. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నాం.. దానికి అనుగుణంగానే అభివృద్ధి చేస్తాం’’ అని బొత్స చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని