Asaduddin Owaisi: మేనిఫెస్టో బాగుంది.. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం: అసదుద్దీన్‌

కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

Published : 16 Oct 2023 19:08 IST

హైదరాబాద్‌: భారాస (BRS) ఎన్నికల మేనిఫెస్టో చాలా బాగుందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఈ మేనిఫెస్టోతో కేసీఆర్‌ మూడోసారి సీఎం కావడం ఖాయమని చెప్పారు. రూ.400కే సిలిండర్‌ ఇస్తామన్న కేసీఆర్ నిర్ణయం చాలా బాగుందని కితాబిచ్చారు. మైనార్టీలకు బడ్జెట్‌ పెంచుతామనడం హర్షణీయమన్నారు. ఎంఐఎం పోటీ చేయని చోట భారాసకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ప్రచారం కోసం రాష్ట్రానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు వస్తారని, రాష్ట్రంలో అభివృద్ధి చూసి వాళ్ల కళ్లు తెరచుకుంటాయని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని