Elections: నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్‌

 ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్‌, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. 

Updated : 27 Feb 2023 09:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్‌, మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి. అయితే నాగాలాండ్‌లో ఒక స్థానం (అకులుటో) ఎన్నిక ఏకగ్రీవం కాగా, మేఘాలయలో ఓ అభ్యర్థి (సోహియాంగ్‌ స్థానంలో) మరణించారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. 

సుమారు 13లక్షల మంది ఓటర్లు ఉన్న నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 2,291 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో అధికార నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), భాజపా పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌, ఎన్‌పీపీ, ఎన్సీపీ, జేడీయూల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు మేఘాలయలో 369 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో 21.6 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారికోసం 3,419 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అక్కడ అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని