Ayyanna Patrudu: బెయిల్‌ కోసం దిల్లీ వెళ్లావు కానీ... నేను నర్సీపట్నంలోనే ఉన్నా...

బెయిల్‌ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి దిల్లీ వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. తనను అజ్ఞాతంలో ఉన్నాననడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

Updated : 26 Jun 2022 07:25 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: బెయిల్‌ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి దిల్లీ వెళ్లిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. తనను అజ్ఞాతంలో ఉన్నాననడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని నర్సీపట్నంలోనే ఉన్నానని శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘ముహూర్తంతో పని లేదు ఎప్పుడొచ్చినా నేను రెడీ. పులయితే పోలీసుల్ని వేసుకొని రాదు.. సింగిల్‌గా రావాలి.  అప్పుడు తేలుతుంది ఎవరు పులో ఎవరు పిల్లో...’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని