Bandi Sanjay: ఆ భయంతోనే రేవంత్‌ కన్నీళ్లు: బండి సంజయ్‌ ఎద్దేవా

పదవి పోతుందేమోనన్న భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

Updated : 23 Apr 2023 15:05 IST

హైదరాబాద్‌: పదవి పోతుందేమోనన్న భయంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలతో ఆయన సతమతమవుతున్నారని విమర్శించారు. సంఘ సంస్కర్త మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి భాజపా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భాగ్యలక్ష్మీ ఆలయానికి రావాలన్న తన కోరిక నెరవేరిందన్నారు. 

‘‘మునుగోడు ఉప ఎన్నికలో రూ.25కోట్లు రేవంత్‌రెడ్డికి ఇచ్చారని భాజపా ఎమ్మెల్యే ఈటల ఎక్కడా అనలేదు. కాంగ్రెస్‌కు ఇచ్చినట్లు మాత్రమే ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు భారాస ఆర్థిక సహాయం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస కలిసి పోటీ చేస్తాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కూడా ఇదే మాటలు అంటున్నారు. భారాస వద్ద కాంగ్రెస్‌ డబ్బు తీసుకున్న మాట వాస్తవం. మునుగోడులో ఈ విషయంపై ప్రచారం జరిగింది. అక్కడి ఓటర్లే దీనిపై స్వయంగా మాట్లాడుకున్నారు’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని