HP BJP Manifesto: ఉమ్మడి పౌర స్మృతి.. ఉచిత స్కూటీలు.. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్!
HP BJP Manifesto: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను భాజపా విడుదల చేసింది. ఉమ్మడి పౌరస్మృతి, విద్యార్థినులకు స్కూటీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వంటి కీలక హామీలు ఇచ్చింది.
శిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అలాగే దశలవారీగా ఎనిమిది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ‘సంకల్ప్ పత్ర’ను ఆవిష్కరించారు. హామీలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో నవంబరు 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
హిమాచల్ ప్రదేశ్లో ఐదు వైద్యకళాశాలల్ని ఏర్పాటు చేస్తామని భాజపా తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులపై పూర్తి స్థాయి సర్వే చేయించి చట్టవిరుద్ధ ఆక్రమణకు చెక్ పెడతామని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా హామీలను ఇచ్చిన భాజపా.. 6-12 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తామని తెలిపింది. ఉన్నత విద్య అభ్యసించే వారికి స్కూటీలను అందజేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపింది. శనివారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ పసలేని హామీల్ని కురిపించిందని నడ్డా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.