Telangana News: రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లన్నీ.. స్కామ్లుగా మారాయి: ఎంపీ లక్మణ్
ప్రతి గల్లీలో మద్యం దుకాణాలు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. తెరాస నేతలపై జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా.. ప్రజా విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి హామీలను విస్మరించారన్నారు. ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు. పేదవాడు వంద గజాల భూమి కొనకుండా విపరీతంగా ధరలు పెంచారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. అది బయటపడుతుందనే భయంతోనే సీబీఐని రాష్ట్రంలోకి రావొద్దంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ తెరాస పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లన్నీ.. స్కాములుగా మారాయన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆద్యుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మ ఘోషిస్తోందన్నారు. ప్రతి గల్లీలో మద్యం దుకాణాలు పెట్టి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని విమర్శలు గుప్పించారు. తెరాస నేతలపై ఐటీ, ఈడీ దాడులకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం కుమార్తె అయినా.. ఎవరైనా చట్టాలకు అతీతం కాదన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రమేయం లేదన్నప్పుడు (కవితను ఉద్దేశించి) నిరూపించుకోవాలని సూచించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసకు బీ టీమ్గా మారిందని విమర్శించారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోవడానికి భాజపా సిద్ధంగా ఉందని లక్ష్మణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.