CM Jagan: సాయంత్రం దిల్లీకి సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ మరోసారి దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం 4.30గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరతారు.

Updated : 16 Mar 2023 17:03 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ మరోసారి దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం 4.30గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరతారు. విమానంలో బయల్దేరి రాత్రి 7.30గంటలకు దిల్లీ చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని