మా మీదే ఎడాపెడా కేసులు పెట్టిస్తే ఎలా?: ఆర్వోకు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి హెచ్చరిక
‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడమ్.. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం అని గుర్తుంచుకోవాలి.
ఒంగోలు, న్యూస్టుడే: ‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడమ్.. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మేం రాజకీయ నాయకులం అని గుర్తుంచుకోవాలి. మా మీద ఇష్టం వచ్చినట్లు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు.. మేం ప్రైవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది జాగ్రత్త.. కాస్త చూసీచూడనట్లు వెళ్లండి..’ అంటూ వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మహిళా రిటర్నింగ్ అధికారిని హెచ్చరించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. వైకాపా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక చంద్రశేఖర్పై మూడు నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ నెల 22న చంద్రశేఖర్ భార్య తన భర్త తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు తమ కుమారుడితో కలిసి వెళ్లారు. కుమారుడు మైనర్ కావటంతో పోలీసులు అడ్డుకున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రిటర్నింగ్ అధికారిణి శ్రీలేఖతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తాము నిబంధనల మేరకే పనిచేస్తున్నామని, నియమావళిని ఉల్లంఘిస్తేనే కేసులు నమోదు చేశామని ఆర్వో బదులిచ్చారు. అయినా యంత్రాంగం తీరుపై చెవిరెడ్డి అసహనం వెలిబుచ్చారు. ముందుగా ఆర్ఓ కేంద్రంలోకి కూడా చెవిరెడ్డి నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించారు. ఆర్వో కార్యాలయంలోకి వెళ్లే ప్రతి ఒక్కరూ రిజిస్టర్లో సంతకం చేయాలి. సెల్ఫోన్లు వెంట తీసుకెళ్లకూడదు. ఈ రెండు నిబంధనలనూ ఆయన అతిక్రమించారు. ప్రతి నామినేషన్ను ఆర్వో కార్యాలయంలో వీడియో చిత్రీకరించాలి. చెవిరెడ్డి ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పటంతో ఆ సమయంలో వీడియో చిత్రీకరణ నిలిపివేసినట్లు తెలిసింది. మహిళా ఆర్ఓ పట్ల చెవిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే: చంద్రబాబు
తాజా ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. -
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో..: షర్మిల ఎద్దేవా
ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని జగన్ అన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
పింఛన్ల పంపిణీ.. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారా?: వైఎస్ షర్మిల
వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పింఛన్ల పంపిణీపై సీఎస్ అబద్ధాలు: తెదేపా
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ 90 శాతం పూర్తి అయిందంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి అబద్ధాలాడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ఎంత ధైర్యం.. మమ్మల్నే ప్రశ్నిస్తావా?
ప్రచారానికి వచ్చిన వైకాపా నాయకులను... తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల గురించి ప్రశ్నించిన మహిళపై ఆ పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. -
భీమిలిలో గంటా X బొత్స
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాజకీయం.. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. అక్కడ తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. -
కాగితాలపైనే గ్రామాలు.. కనిపించరక్కడ ప్రజలు!
ఎన్నికలొచ్చాయంటే నాయకులకు ఎక్కడెక్కడో ఉన్న ఊళ్లన్నీ గుర్తుకొస్తాయి. ఏనాడూ వెళ్లని ఊళ్ల రికార్డులు తెప్పించుకొని మరీ అక్కడికి వెళ్లి ఓట్ల వేట మొదలుపెడతారు. -
పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు జగన్?: చీపురుపల్లి సభలో బాలకృష్ణ
అమరావతి రాజధానిపై ఉద్యమిస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న సీఎం జగన్ విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. -
వృద్ధులపై ప్రభుత్వానికి కనికరం లేదా?: డీఎల్ రవీంద్రారెడ్డి
పింఛను డబ్బు బ్యాంకులో జమ చేశామని, వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్న ప్రభుత్వానికి ప్రజలు, వృద్ధులపై ఏమాత్రం కనికరం లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మీ వెనుక నేనుంటా.. మాటకు కట్టుబడి ఉంటా
‘దశాబ్దం తర్వాత ప్రజలను ఓటేయమని అడగట్లేదు.. వేడుకుంటున్నా.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చేస్తోంది. -
జగన్వి నవ దందాలు
‘పొరపాటున వైకాపాకు ఓటేశారో మీ ఇంటికి గొడ్డలి వస్తుంది.. జాగ్రత్త’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఓటర్లను హెచ్చరించారు. సీఎం జగన్ నవ దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
ఏలూరు పోరు.. కూటమిదే జోరు!
గోదారి గలగలలు.. కొల్లేటి పక్షుల కిలకిలలు.. ఆత్మీయ పలకరింపుల సంగమమైన ఏలూరు జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల్లో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. ఏలూరు జిల్లా వాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
జమీందార్ల ప్రచార పత్రం ఎలా ఉండేదంటే?
జమీందారీ వ్యవస్థలు ఉన్నప్పుడు 1937లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 1937 ఫిబ్రవరి 9న విజయనగరం గ్రామ సంస్థానానికి ఎన్నిక నిర్వహించారు. -
నువ్వెంత.. నీ అంతు చూస్తా
విధుల్లో ఉన్న గిరిజన మహిళా కానిస్టేబుల్పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచరుడు రెచ్చిపోయారు. కులం పేరుతో దూషించారు. -
పోలవరం పనుల్లో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం
ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
తాజా వార్తలు
-
కోల్కతా విజయం.. ముంబయికి వరుసగా నాలుగో ఓటమి
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు