Jeevan Reddy: కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలని.. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) కోరారు.
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై న్యాయ విచారణ జరిపించాలని.. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) కోరారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టను గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా.. పర్యాటకంగా వాడుకుందని ఆరోపించారు.
కేసీఆర్ విఫలమయ్యారు
‘‘మిషన్ భగీరథ పథకం కూడా కమీషన్ల ప్రాజెక్టే. అన్ని వసతులు ఉన్నా, రామగుండం కాదని యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టారు. విద్యుత్ విభాగంలో ₹80,000ల కోట్ల అప్పులు ఉన్నాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథపై విచారణ జరిపించాలి. ఐటీఐఆర్ ప్రాజెక్టును భారాస ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం అంటోంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలి. కేంద్రం వివక్ష వల్ల జాతీయ హోదా సాధించలేకపోయాం. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకోవాలి. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత తగదు. సాగు నీరు హక్కులు కాపాడటంలో కేసీఆర్ (KCR) విఫలమయ్యారు. కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారు’’ అని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.