ఆయుష్మాన్ భారత్లో సేవలు శూన్యం: కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కంటే దిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మెరుగ్గా ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కంటే దిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మెరుగ్గా ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉచిత వైద్యం అందించేందుకు ఆప్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఆయన స్పష్టంచేశారు. ఎంతోమంది పేద రోగులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందుతున్నారని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు సైతం చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో రోగులకు చికిత్సలు అందడంలేదన్నారు. ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్, ఫ్రిజ్, రూ.10వేల ఆదాయం ఉన్న వారెవరూ ఈ పథకానికి అర్హులు కాదని అంటున్నారని అన్నారు. అందుకే ఉత్తర్ప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి చాలామంది వైద్య సేవల కోసం దిల్లీకి వస్తున్నారని పేర్కొన్నారు. హరియాణాలోనూ అదే పరిస్థితి ఉందని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రజలకు కేవలం ఒక కార్డు మాత్రమే ఇస్తారని.. దాంతో మరెలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్