సీఏఏని వ్యతిరేకిస్తూ 3వేల కి.మీ ర్యాలీ
ముంబయి: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 3000 కి.మీ ర్యాలీని చేపట్టారు. గాంధీ శాంతి యాత్ర పేరిట నిర్వహిస్తున్న ఈ ర్యాలీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి
ముంబయి: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా 3000 కి.మీ ర్యాలీని చేపట్టారు. గాంధీ శాంతి యాత్ర పేరిట నిర్వహిస్తున్న ఈ ర్యాలీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ముంబయి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 21రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 30 దిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఈ యాత్ర ముగియనుంది. భాజపా పాలిత రాష్ట్రాలైన గుజరాత్, హరియాణా, ఉత్తర్ప్రదేశ్తో సహా ఆరు రాష్ట్రాల మీదుగా ఈ ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా శరద్పవార్ మాట్లాడారు.
‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశ ఐక్యత దెబ్బతింటోంది. మైనార్టీలతో సహా పలు వర్గాలు తాము ఎక్కడి నుంచి వచ్చాం, ఎప్పటి నుంచి భారత్లో నివసిస్తున్నామనే విషయాన్ని రుజువు చేసుకోలేకపోతున్నాయి. కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. జేఎన్యూలో జరిగిన ఘటన ఎంతో మంది భారతీయులను కలచివేసింది. సీఏఏను పలువురు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. సీఏఏని వ్యతిరేకించేందుకు మహాత్మాగాంధీ సిద్ధాంతమే ఏకైక మార్గం. ఎటువంటి ఆందోళన లేకుండా శాంతియుతంగా ర్యాలీ చేపట్టాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా తాము ఈ ర్యాలీ చేపడుతున్నట్లు యశ్వంత్ సిన్హా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.