చట్టం కాకుండానే ‘దిశ’ స్టేషన్లేంటి?:ఆదిరెడ్డి
సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టుల పట్ల తక్షణం విచారణ చేసి దోషులను శిక్షించాలని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్లో...
రాజమహేంద్రవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టుల పట్ల తక్షణం విచారణ చేసి దోషులను శిక్షించాలని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభలో మద్యంపై తాను మాట్లాడిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అయితే, కేంద్రం ఇంకా చట్టాన్ని ఆమోదించనందున ప్రస్తుతానికి ఇంకా ‘దిశ’ కేసును నమోదు చేయలేమని పోలీసులు చెప్పారన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాలు పూర్తికాకుండానే ప్రత్యేక పోలీసు స్టేషన్లతో మహిళలను మభ్యపెట్టేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆదిరెడ్డి భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా అయితే ‘దిశ’ పోలీసు స్టేషన్లలో సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మహిళా నేతలు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు