డ్రోన్లతో చిత్రీకరించారనడం అవాస్తవం: సుచరిత

గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుంటూరులో ఆమె మీడియా...

Published : 23 Feb 2020 02:09 IST

గుంటూరు: గత ఐదేళ్లలో తెదేపా అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గుంటూరులో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిలో మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో చిత్రీకరించారనేది అవాస్తవమన్నారు. పోలీసుల పనితీరుపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. రాజధానిలో భూములు అభివృద్ధి చేసి ఇస్తామనీ.. ఎవరికీ ఆందోళన అవసరం లేదని సుచరిత చెప్పారు. రాజధాని ఎక్కడికీ తరలిపోవడంలేదన్న ఆమె.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ మాత్రమే జరుగుతోందని చెప్పారు. సీఎం జగన్‌ రైతుల పక్షపాతి అని, రైతులకు ఆయన అన్యాయం చేయరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని