తెదేపాకు డొక్కా రాజీనామా

ఎమ్మెల్సీ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికల వేళ చివరి నిమిషంలో ప్రత్తిపాడు సీటు కేటాయించారని

Published : 09 Mar 2020 12:46 IST

అమరావతి: ఎమ్మెల్సీ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికల వేళ చివరి నిమిషంలో ప్రత్తిపాడు సీటు కేటాయించారని డొక్కా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి పాలవుతానని తెలిసినా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో శాసన మండలి సమావేశాలు వివాదాస్పదం అవుతాయని ఊహించే సభకు హాజరుకాలేదని తెలిపారు. మండలి సమావేశాలకు ముందే వైకాపా వైపు మొగ్గు చూపినా ఆ పార్టీ నేతలతో ఎలాంటి చర్చలూ జరపలేదని డొక్కా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని