అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో తెదేపా

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో హాజరు కావాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా? వద్దా?, అక్కడ

Published : 15 Jun 2020 16:34 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలతో హాజరు కావాలని తెలుగుదేశం శాసనసభాపక్షం నిర్ణయించింది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలకు హాజరు కావాలా? వద్దా?.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అయితే అసెంబ్లీకి వెళ్లొద్దని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించారు. కానీ, సమావేశాలకు హాజరు కాకపోతే మండలిలో కొన్ని బిల్లులు ఆమోదించుకునే ప్రమాదం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన శాసనసభాపక్షం అవసరమైతే పరిస్థితిని బట్టి వాకౌట్‌ చేసి రావొచ్చనే ఏకాభిప్రాయానికి వచ్చింది. తెలుగుదేశం నేతలపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ నల్ల చొక్కాలతో వెళ్లాలని ఈ మేరకు నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని