జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు?

108 అంబులెన్స్‌ల స్కామ్‌పై వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవాళ్లపై చర్యలు తీసుకోవాలని...

Published : 25 Jun 2020 02:44 IST

ప్రభుత్వానికి తెదేపా నేత పట్టాభి ప్రశ్న

అమరావతి: 108 అంబులెన్స్‌ల స్కామ్‌పై వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. జ్యుడీషియల్‌ రివ్యూ పేరు చెప్పి... వెయిటేజీ మార్కులు పెంచడంలో కుట్ర ఉందని పట్టాభి ఆరోపించారు. అనుభవం లేని అరబిందో ఫౌండేషన్‌కి ఏదో విధంగా 108 అంబులెన్స్‌ సర్వీసులను కట్టబెట్టడం కోసం... జ్యుడీషియల్‌ రివ్యూ పేరుతో వైకాపా ప్రభుత్వం క్లాజుల్లో మార్పులు చేసిందని పట్టాభి ఆరోపించారు. 

ఇన్ని కుట్రలా...

కరోనా సమయంలో సరిపడా అంబులెన్స్‌లు ఎందుకు పెట్టలేదని పట్టాభి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘కరోనా రోగులను తరలించే అంబులెన్స్‌లోనే ఇతర రోగులను తరలిస్తున్నారు. ఇతర రోగుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు?  అరబిందో కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి ఇన్ని కుట్రలా? ’’ అని పట్టాభి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని