Balineni Srinivasa Reddy: నేను చెన్నైలో జూదం ఆడేవాడిని

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో వైకాపా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తనకు గతంలో జూదం అలవాటు ఉందని, చెన్నైలో ఆడేవాడినని వ్యాఖ్యానించారు.

Updated : 25 Jan 2023 12:35 IST

మాజీ మంత్రి బాలినేని వ్యాఖ్య

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో వైకాపా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తనకు గతంలో జూదం అలవాటు ఉందని, చెన్నైలో ఆడేవాడినని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ (రాజ్యసభ) బీద మస్తాన్‌రావు గురించి ప్రస్తావిస్తూ ఎంపీ తనకు మంచి స్నేహితుడని, ఆయన తెదేపాలో ఉన్నప్పటి నుంచే పరిచయం ఉందన్నారు. తరచూ చెన్నైలో కలుసుకునేవారమని.. తనకు జూదం అలవాటు ఉంది గానీ, ఆయనకు లేదన్నారు. దీంతో సభ నవ్వులతో నిండిపోయింది. ఇవన్నీ పాత విషయాలంటూ సర్దిపుచ్చే యత్నం చేశారు. తాను చేసే ఖర్చులు అధికంగా ఉండేవని అప్పట్లో మస్తాన్‌రావు వ్యాఖ్యానించేవారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు