నా ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా?
‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు.
వీడియో సందేశంలో మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్
ధూల్పేట, న్యూస్టుడే: ‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు. అంటే దీని అర్థం.. రాజాసింగ్ బతికితే ఏంటి? చనిపోతే ఏంటి? అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు భావించాల్సి వస్తోంది’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘రెండురోజుల కిందట నా బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించింది. షెడ్కు తీసుకువెళ్లిన సిబ్బంది నిన్న తిరిగి అదే వాహనాన్ని పంపారు. పాడైన వాహనాన్ని ఎందుకు పంపిస్తున్నారని పైఅధికారులతో మాట్లాడితే.. దాన్నే మరమ్మతు చేసి పంపాలని పైనుంచి ఆదేశాలున్నాయి అని ఒక అధికారి అన్నారు’’ అని రాజాసింగ్ అందులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.