నా ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా?

‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు.

Updated : 27 Jan 2023 09:53 IST

వీడియో సందేశంలో మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్‌

ధూల్‌పేట, న్యూస్‌టుడే: ‘‘నా ప్రాణానికి తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ అధికారులే చెబుతున్నారు. నాకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం తరచూ చెడిపోతున్నా కొత్తది ఇవ్వకుండా దాన్నే తూతూమంత్రంగా మరమ్మతులు చేయించి పంపిస్తున్నారు. అంటే దీని అర్థం.. రాజాసింగ్‌ బతికితే ఏంటి? చనిపోతే ఏంటి? అనే భావనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు భావించాల్సి వస్తోంది’’ అని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. ‘‘రెండురోజుల కిందట నా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం మొరాయించింది. షెడ్‌కు తీసుకువెళ్లిన సిబ్బంది నిన్న తిరిగి అదే వాహనాన్ని పంపారు. పాడైన వాహనాన్ని ఎందుకు పంపిస్తున్నారని పైఅధికారులతో మాట్లాడితే.. దాన్నే మరమ్మతు చేసి పంపాలని పైనుంచి ఆదేశాలున్నాయి అని ఒక అధికారి అన్నారు’’ అని రాజాసింగ్‌ అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని