ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వానిది మొద్దునిద్ర
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసైని కోరింది.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
గవర్నర్ను కోరిన భాజపా బృందం
ఈనాడు, హైదరాబాద్, ఖైరతాబాద్, న్యూస్టుడే: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసైని కోరింది. ఈ మేరకు శనివారం పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేతృత్వంలో నాయకుల బృందం గవర్నర్ని కలిసి వినతిపత్రం అందజేసింది. లీకేజీ వ్యవహారంలో జోక్యం చేసుకుని యువతలో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవడంతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. లీకేజీకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని వినతిపత్రంలో డిమాండ్ చేసింది. గవర్నర్ను కలిసిన అనంతరం ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన నాలుగు, జరగబోయే రెండు పరీక్షలు మొత్తం ఆరు పేపర్లు లీక్ కావడం సీఎం కేసీఆర్ పాలన తీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. పేపర్ల లీకేజీ ఉద్దేశపూర్వకమా? యాదృచ్ఛికమా? చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేసి తప్పించుకోవద్దన్నారు. భాజపా అండగా ఉంటుందని, అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన టీఎస్పీఎస్సీ ఛైర్మన్తో పాటు సభ్యులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. వ్యవస్థలో లోపంతోనే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. ఉద్యోగులకే సరిగా జీతాలివ్వని ప్రభుత్వం.. కొత్త నియామకాలు జరిగితే ఇబ్బందని భావిస్తోందన్నారు. గవర్నర్ని కలిసిన బృందంలో మర్రి శశిధర్రెడ్డి, రాంచందర్రావు, ఎస్.కుమార్, రవీందర్రెడ్డి, చంద్రవదన్, విఠల్, కృష్ణప్రసాద్ ఉన్నారు. భాజపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లేట్ల ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.