అన్న రాజమోహన్రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!
‘ప్రభుత్వం అండ ఉన్న వారు ఏ ఆటలైనా ఆడతారు.. నేను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. 2024 ఎన్నికల్లో చూసుకుంటా’ అని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి ఆవేదన
మర్రిపాడు, న్యూస్టుడే: ‘ప్రభుత్వం అండ ఉన్న వారు ఏ ఆటలైనా ఆడతారు.. నేను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. 2024 ఎన్నికల్లో చూసుకుంటా’ అని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మర్రిపాడులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన అన్న, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, కుటుంబం కోసం ఎంతో మందితో గొడవపడ్డానని చెప్పారు. అధికారం ఎక్కడ పోతుందోనని. ఆయన ఒక బృందాన్ని పెట్టుకొని ఊరేగుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత గొడవలకు రాజమోహన్రెడ్డి సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అన్నదమ్ములు ఉంటారనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకుముందు మేకపాటి వాళ్లు ఆనందంగా ఉంటారనుకునేవారు.. ఇప్పుడు భలేగా ఉందయ్యా అన్నదమ్ముల యవ్వారం అనుకుంటున్నారు అన్నారు.
గుండె నొప్పి వచ్చింది: ‘నా ఆరోగ్యం ప్రస్తుతం సరిగాలేదు. గురువారం రాత్రి కూడా గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యా. వైద్యులను సంప్రదించి నెల్లూరు, చెన్నైకు వెళతా. ఆరోగ్యం కుదుటపడితే రాజకీయంలో ఉంటా.. లేకుంటే దూరమవుతా’ అని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
వైకాపా నీడ లేకుంటే తెలుస్తుంది
ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి
ఆత్మకూరు, న్యూస్టుడే: పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ చేస్తే చర్యలు తీసుకోవడం సరైనదేనని తన నాన్న, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి సమర్థించినట్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మర్రిపాడులో ఆయన మాట్లాడుతూ.. తన చిన్నాన్న మేకపాటి చంద్రశేఖర్రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. ‘నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని పార్టీ నమ్మింది. అందుకే చర్యలు తీసుకుంది. ఆ హక్కు పార్టీకి ఉంది. క్రమశిక్షణ లేకపోతే పార్టీని నడపడం కష్టం’ అని అన్నారు. 2024 ఎన్నికల్లో సత్తా చూపుతానని చెబుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ‘ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. వైకాపా, కుటుంబాల నీడ లేకుండా సొంతంగా పోటీ చేయనీయండి.. ఎవరు ఏమిటో తెలియవస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.