Ambati Rambabu: ప్రతి ఇంటికీ వెళ్లి జగన్‌ బొమ్మ అంటించడానికి మాకేం పని: మంత్రి అంబటి

ప్రతి ఇంటికీ వైకాపా వాళ్లొచ్చి జగన్‌ స్టిక్కర్లు అంటిస్తారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ అంటున్నారని.. ప్రతి ఇంటికీ వెళ్లి జగన్‌ బొమ్మ అంటించడానికి మాకేం పని.. చంద్రబాబు ఇంటిపై జగన్‌ స్టిక్కర్‌ అంటిస్తామా!’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Updated : 08 Apr 2023 07:08 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ప్రతి ఇంటికీ వైకాపా వాళ్లొచ్చి జగన్‌ స్టిక్కర్లు అంటిస్తారని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ అంటున్నారని.. ప్రతి ఇంటికీ వెళ్లి జగన్‌ బొమ్మ అంటించడానికి మాకేం పని.. చంద్రబాబు ఇంటిపై జగన్‌ స్టిక్కర్‌ అంటిస్తామా!’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నూటికి 50 శాతానికి మించి ప్రజలు జగన్‌ స్టిక్కర్‌ అంటించేందుకు అనుమతి ఇస్తారనే నమ్మకం ఉందన్నారు.  ప్రజల అనుమతితోనే ఇంటి గోడలపై.. చరవాణులపై స్టిక్కర్లు అంటిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో కుంకలగుంట, అనుపాలెం గ్రామాల్లో తాను 20 ఇళ్లు తిరగడానికి రెండు గంటల పైచిలుకు సమయం పట్టిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని