Karnataka - Latha Mallikarjun: హస్తానికి జైకొట్టిన రెబల్ ఎమ్మెల్యే
కర్ణాటకలో కాంగ్రెస్కు అదనపు బలాలూ సమకూరుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో దర్శన్ (మేలుకోటె) కాంగ్రెస్ అండతోనే గెలిచారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే: కర్ణాటకలో కాంగ్రెస్కు అదనపు బలాలూ సమకూరుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో దర్శన్ (మేలుకోటె) కాంగ్రెస్ అండతోనే గెలిచారు. ఆయన పార్టీ సానుభూతిపరుడిగానే ఉన్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే మద్దతు పలికారు. హరపనహళ్లిలో భాజపా సీనియర్ నేత గాలి కరుణాకరరెడ్డిని ఓడించిన రెబల్ అభ్యర్థి లతా మల్లికార్జున కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఆమె ఆదివారం బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి సత్కరించారు. కాంగ్రెస్ తనకు టికెట్ నిరాకరించినా.. రాజకీయ మనుగడ కోసం స్వతంత్రంగా పోటీ చేశానని, పార్టీకి విధేయురాలిగానే ఉంటానని ఆయనకు తెలిపారు. ఆమె విజయాన్ని సిద్ధు అభినందించారు. లత తండ్రి దివంగత ఎంపీ ప్రకాశ్ కర్ణాటకలో స్వచ్ఛ రాజకీయవాదిగా పేరు గడించారు. దర్శన్, లతల మద్దతుతో కాంగ్రెస్ బలం 137కు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.