రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్న భాజపా
భాజపా మను ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తోందని ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఆరోపించారు.
ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్
పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతిచే ప్రారంభం చేయించలేదని నిరసన దీక్ష
గాంధీభవన్, న్యూస్టుడే: భాజపా మను ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తోందని ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఆరోపించారు. పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత ప్రారంభింప చేయకపోవడానికి నిరసనగా పీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్లో నిరసన దీక్ష జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్రపతి గిరిజన మహిళ కావడంతోనే ఆమెతో పార్లమెంటు భవనం ప్రారంభం చేయించలేదన్నారు. భాజపా రాచరిక వ్యవస్థను తీసుకువచ్చి వెనకబడ్డ వారిని బానిసల్ని చేసే పద్ధతిలో నడుస్తోందని విమర్శించారు. రాచరిక వ్యవస్థ వద్దు.. ప్రజారాజ్యం కావాలని.. అందరూ ఒక్కతాటిపైకి కావాలని కోరారు. అశోక చక్రం, అశోక చిహ్నాన్ని కాదని రాజదండం పెట్టారని, అది ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆదివాసీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతుందన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాల హక్కులను భాజపా హరిస్తోందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ సమన్వయకర్త కేతూరి వెంకటేశ్, రాష్ట్ర ఎస్టీసెల్ కోఆర్డినేటర్ రవినాయక్, చందా లింగయ్య మాట్లాడారు. దీక్ష అనంతరం సచివాలయం వద్ద ఉన్న ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండటంతో వినతిపత్రాన్ని గేటుకు పెట్టి వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.