చండీగఢ్లో రూ.7,127 ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36 వేలెందుకు?
చండీగఢ్లో ఒక్కో స్మార్ట్మీటర్ ధర, నిర్వహణతో కలిసి రూ.7,127, రాజస్థాన్లో రూ.7,945గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36,975గా నిర్ణయించి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: చండీగఢ్లో ఒక్కో స్మార్ట్మీటర్ ధర, నిర్వహణతో కలిసి రూ.7,127, రాజస్థాన్లో రూ.7,945గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36,975గా నిర్ణయించి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు అవినాష్రెడ్డి బినామీ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్కు అడ్డగోలుగా దోచిపెట్టడానికే సీఎం జగన్ స్మార్ట్ మీటర్ల ముసుగులో కొత్త కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కడప కార్యాలయంలోనే అంచనాలు తయారు చేశారని, తిరుపతి సీఎండీ ఆయన బృందం ఇందులో పాల్గొని దోపిడీకి ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు. అసలు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కార్యాలయంలో తిరుపతి సీఎండీకి ఏం పని? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో డిస్కంల సీఎండీలూ భాగస్వాములయ్యారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.