చండీగఢ్లో రూ.7,127 ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36 వేలెందుకు?
చండీగఢ్లో ఒక్కో స్మార్ట్మీటర్ ధర, నిర్వహణతో కలిసి రూ.7,127, రాజస్థాన్లో రూ.7,945గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36,975గా నిర్ణయించి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: చండీగఢ్లో ఒక్కో స్మార్ట్మీటర్ ధర, నిర్వహణతో కలిసి రూ.7,127, రాజస్థాన్లో రూ.7,945గా ఉంటే.. ఏపీలో మాత్రం రూ.36,975గా నిర్ణయించి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు అవినాష్రెడ్డి బినామీ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్కు అడ్డగోలుగా దోచిపెట్టడానికే సీఎం జగన్ స్మార్ట్ మీటర్ల ముసుగులో కొత్త కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ కడప కార్యాలయంలోనే అంచనాలు తయారు చేశారని, తిరుపతి సీఎండీ ఆయన బృందం ఇందులో పాల్గొని దోపిడీకి ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు. అసలు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కార్యాలయంలో తిరుపతి సీఎండీకి ఏం పని? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో డిస్కంల సీఎండీలూ భాగస్వాములయ్యారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు