భారాసను వీడిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్‌ భారాసను వీడారు. కరీంనగర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Published : 15 Sep 2023 04:59 IST

కరీంనగర్‌, ఈనాడు: కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్‌ భారాసను వీడారు. కరీంనగర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో కొన్నిరోజులుగా అనుచరులు, అభిమానులతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఇటీవల ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సముదాయించారు. అయినప్పటికీ భారాసను వీడాలని నిర్ణయించుకున్న మోహన్‌ అధిష్ఠానానికి తన రాజీనామా లేఖ పంపిస్తానని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని