TDP: ‘పెద్దిరెడ్డికి ‘ఇసుక రత్న’, అంబటికి ‘కుంపటి రత్న’ పురస్కారాలివ్వాలి’

రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక రత్న, తన శాఖను గాలికొదిలి కులాల మధ్య కుంపట్లు పెడుతున్న అంబటి రాంబాబుకు కుంపటి రత్న పురస్కారాలివ్వాలని తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ ఓ ప్రకటనలో సీఎం జగన్‌కు సూచించారు.

Updated : 02 Nov 2023 08:17 IST

తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ ఎద్దేవా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఇసుక దోపిడీ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక రత్న, తన శాఖను గాలికొదిలి కులాల మధ్య కుంపట్లు పెడుతున్న అంబటి రాంబాబుకు కుంపటి రత్న పురస్కారాలివ్వాలని తెదేపా అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్‌ ఓ ప్రకటనలో సీఎం జగన్‌కు సూచించారు. ‘స్థాయికి మించి మాట్లాడే జోగి రమేష్‌కు బడాయి రత్న, రోజాకు కోతల రత్న, జూదం క్లబ్బులు నిర్వహిస్తున్న గుమ్మనూరు జయరాంకు జూద రత్న, పశువుల దాణాను బొక్కేస్తున్న అప్పలరాజుకు పశుదాణా రత్న, తానే అపర మేధావినని భావించే సజ్జల రామకృష్ణారెడ్డికి అపర మేధావి రత్న, కొడాలి నానికి బూతు రత్న, పేదల భూములు కబ్జా చేస్తున్న బియ్యపు మధుసూదనరెడ్డికి భూబకాసుర రత్న అవార్డులివ్వాలి’  అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని