Sanju Samson: వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు భారత ఆటగాడు సంజూ శాంసన్ (Sanju Samson) ప్రపంచ కప్ జట్టులోకి అడుగుపెట్టాడు. గత వన్డే వరల్డ్కప్ సమయంలోనూ అతడి పేరు బాగా వినిపించినా.. కొన్ని సమీకరణాల వల్ల సంజూకు చోటు దక్కలేదు. ఈసారి మాత్రం అద్భుతమైన ఫామ్తో ఐపీఎల్లో పరుగులు చేస్తుండటంతో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. రిషభ్ పంత్కు బ్యాకప్గా సంజూను తీసుకున్నా.. మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాటర్గానైనా బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. దీంతో తమ అభిమాన ఆటగాడికి అవకాశం దక్కడంపై సోషల్ మీడియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సంజూ తన మాతృభాష మలయాళంలో చేసిన పోస్టు వైరల్గా మారింది.
‘‘వియర్పు తునియిట్టా కుప్పాయమ్’’.. ఇదీ సంజూ చేసిన పోస్టు. దీనికి అర్థం ‘‘చెమట, కష్టంతో కుట్టిన చొక్కా’’. భారత జాతీయజట్టులో అరంగేట్రం చేసిన చాన్నాళ్లకు ఇప్పుడు అవకాశం రావడంతో అతడు ఇలా స్పందించాడని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 2015లో భారత జట్టు తరఫున టీ 20ల్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ నిలకడగా జాతీయజట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్లో భారీగా పరుగులు చేస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టేశారు. ఇప్పటివరకు కేవలం 25 అంతర్జాతీయ టీ20లను ఆడిన సంజూ 374 పరుగులు చేశాడు. ఓపెనర్, మిడిలార్డర్లో పరుగులు చేయడం అతడి స్పెషాలిటీ. ఐపీఎల్లో 161 మ్యాచుల్లో ఆడిన అతడు 4,273 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. ఇప్పుడు భారత జట్టు తరపున వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న సంజూకి తుది జట్టులోనూ స్థానంలో కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.
దూబె ఎంపిక భారత్పై ‘ఇంపాక్ట్’ ఉంటుంది: స్టీఫెన్ ఫ్లెమింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివమ్ దూబెను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయడంపై ఆ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ‘‘స్పిన్నర్లపై ఎదురుదాడి చేయడంలో దూబెని మించిన వారెవరూ లేరని నిరూపించుకున్నాడు. అతడి పవర్ అద్భుతం. తప్పకుండా వరల్డ్ కప్లో భారత్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడు. ఇంత మంచి అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. మ్యాచ్ను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఆడటంలో నేర్పరి. చెన్నై జట్టుకు దూబె బలంగా మారాడు. తాను సరిగ్గా ఆడలేని బంతులను ఎదుర్కొనేందుకు చాలా కష్టపడతాడు. ఇప్పుడు ఫామ్తో భారత్పై ‘ఇంపాక్ట్’ చూపిస్తాడు’’ అని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
PlayOffs Teams Names: ఐపీఎల్ 17వ సీజన్లో నాకౌట్ మ్యాచ్ల సందడి మొదలు కానుంది. దీనికి అర్హత సాధించిన నాలుగు జట్ల పేర్లు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. -
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
ఈ సారి ఐపీఎల్ టాప్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు. -
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
భారత ప్రధాన కోచ్ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి. -
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
ఐపీఎల్ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్ స్టేజ్లో కోల్కతా - రాజస్థాన్ మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. -
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా - హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
తొలి అడుగు ఎవరిదో
రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్-1. -
ఇది కోహ్లి రాసిన కథ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. -
మన అమ్మాయి బంగారం
జపాన్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. -
దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. -
జ్యోతి బృందానికి పసిడి
ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత 4×400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్ జ్యోతికశ్రీ దండి, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. -
మహి సరదాగా అలా
ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. -
సింధుకు పరీక్ష
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
ఆసియా ఆర్చరీకి గణేశ్
దక్షిణ కొరియాలోని సువాన్లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు
భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు? -
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్