Chennai Vs Punjab: చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది. నాలుగు బెర్తుల్లో రాజస్థాన్ ఒక ప్లేస్ దాదాపు ఖాయం చేసుకుంది. మిగిలిన మూడింటి కోసం ఐదు జట్లు బరిలో ఉన్నాయి. వాటిలో చెన్నై కూడా ఉంది. అయితే చెన్నై పరిస్థితి అలా లేదు. రెండు మ్యాచులు గెలిస్తే రెండు ఓడుతూ వస్తోంది. ఈ ట్రెండ్ను మరిచి వరుస విజయాలు సాధించడం ఇప్పుడు అత్యవసరం. దానికి ఈ రోజు జరగబోయే పంజాబ్ మ్యాచ్ చాలా కీలకం.
పంజాబ్ను ఈసారైనా అడ్డుకుంటారా?
- మొదటి మ్యాచ్లో బెంగళూరుపై విజయం సాధించి పాయింట్ల ఖాతాను తెరిచిన చెన్నై.. తర్వాత గుజరాత్ను కూడా చిత్తు చేసింది. మరోసారి టైటిల్ను కొట్టే దిశగా దూసుకుపోతుందని చెన్నై ఫ్యాన్స్ జోష్లో ఉన్నారు.
- ఆ తర్వాత దిల్లీ, హైదరాబాద్ చేతిలో వరుసగా ఓటములను చవిచూసింది. ఆ తర్వాత బలమైన కోల్కతాను, స్టార్లున్న ముంబయిని ఓడించింది.
- లఖ్నవూతో వరుసగా జరిగిన రెండు మ్యాచుల్లోనూ చెన్నైకు పరాజయం తప్పలేదు. కానీ, సొంతమైదానంలో హైదరాబాద్ను చిత్తు చేసి మళ్లీ విజయాల బాట పట్టింది.
- ఇప్పుడు వరుస మ్యాచుల్లో పంజాబ్ను ఢీకొట్టనుంది. మరో నాలుగు రోజుల్లో (మే 5న) ధర్మశాలలో తలపడనుంది. ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో మ్యాచులున్నాయి.
- చెన్నై బ్యాటింగ్ ఎక్కువగా రుతురాజ్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీపైనే ఆధారపడుతోంది. డారిల్ మిచెల్, అజింక్య రహానె పెద్దగా ప్రభావం చూపడంలేదు.
- హైదరాబాద్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన డారిల్ మళ్లీ ఫామ్ అందుకోవడం చెన్నైకి కలిసొచ్చే అంశమే. ఓపెనర్గా వస్తున్న అజింక్య రహానె కూడా బ్యాట్ను ఝళిపిస్తే పంజాబ్కు కష్టాలు తప్పవు.
- బౌలింగ్లో తుషార్ దేశ్పాండే హైదరాబాద్పై విజృంభించాడు. ముస్తాఫిజుర్, దీపక్, పతిరన ప్రత్యర్థులను హడలెత్తించారు. స్పిన్ విభాగం రవీంద్ర జడేజా ఆధ్వర్యంలో నడుస్తోంది.
- చెన్నై - పంజాబ్ ఇప్పటివరకు ఐపీఎల్లో 28 మ్యాచుల్లో తలపడ్డాయి. సీఎస్కే 15 మ్యాచుల్లో గెలవగా.. పంజాబ్ 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
- చెపాక్ స్టేడియంలో పంజాబ్ మూడింట్లో గెలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా కింగ్స్పై సూపర్ కింగ్స్ విజయం సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన పంజాబ్.. కోల్కతాపై 262 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించి తిరిగి ఫామ్లోకి వచ్చింది.
తుది జట్లు (అంచనా)
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మతీశా పతిరన, ముస్తాఫిజుర్
పంజాబ్: ప్రభ్సిమ్రన్ సింగ్, జానీ బెయిర్స్టో, రిలీ రొసో, శశాంక్ సింగ్, సామ్ కరన్, జితేశ్ శర్మ, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ టాప్-2 జట్లలో వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేరా..!
ఈ సారి ఐపీఎల్ టాప్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు. -
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
భారత ప్రధాన కోచ్ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి. -
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
ఐపీఎల్ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్ స్టేజ్లో కోల్కతా - రాజస్థాన్ మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. -
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా - హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
తొలి అడుగు ఎవరిదో
రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్-1. -
ఇది కోహ్లి రాసిన కథ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. -
మన అమ్మాయి బంగారం
జపాన్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. -
దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. -
జ్యోతి బృందానికి పసిడి
ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత 4×400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్ జ్యోతికశ్రీ దండి, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. -
మహి సరదాగా అలా
ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. -
సింధుకు పరీక్ష
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
ఆసియా ఆర్చరీకి గణేశ్
దక్షిణ కొరియాలోని సువాన్లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు
భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు? -
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
ఐపీఎల్ టాప్-2 జట్లలో వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేరా..!
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి