PrakashRaj: రాజకీయ పార్టీల ఒత్తిడితో ఫోను స్విచ్చాఫ్ చేసుకున్నా: ప్రకాష్రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని మూడు రాజకీయ పార్టీలు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ తెలిపారు.
కోజికోడ్: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని మూడు రాజకీయ పార్టీలు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ తెలిపారు. పార్టీలు తన సిద్ధాంతాలను చూసి కాకుండా కేవలం ప్రధాని మోదీని విమర్శిస్తున్నందున ఈ ఒత్తిడి తెస్తున్నాయని.. వాటి వలలో పడబోనని చెప్పారు. కేరళ సాహితీ ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్రాజ్ రాజకీయాల గురించి మాట్లాడారు. ‘‘ఎన్నికలు వస్తున్నాయి. నా వెంటపడిన ఆ మూడు రాజకీయ పార్టీల ఒత్తిడి భరించలేక ఫోను స్విచ్చాఫ్ చేసుకున్నా. కేవలం మోదీ మీద వ్యతిరేకత తప్ప ప్రజల కోసం వాళ్లు రావడం లేదు. ఈ రోజుల్లో రాజకీయ పార్టీలకు సొంత గొంతుక ఉండటం లేదు. అందుకే అభ్యర్థుల కోసం ఈ వెదుకులాట. మనకెంత దుర్గతి పట్టిందీ!’’ అన్నారు. దేశ, విదేశాల నుంచి దాదాపు 400 మంది ప్రముఖులు పాల్గొన్న కేరళ సాహితీ ఉత్సవం ఆదివారంతో ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్