Payyavula: జగన్‌ పతనానికి... జనమే స్టార్‌ క్యాంపెయినర్లు: పయ్యావుల

రాష్ట్రంలో సీఎం జగన్‌ బాధితులంతా తెదేపాకు స్టార్‌ క్యాంపెయినర్లేనని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్పష్టంచేశారు.

Updated : 24 Jan 2024 07:09 IST

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీఎం జగన్‌ బాధితులంతా తెదేపాకు స్టార్‌ క్యాంపెయినర్లేనని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ స్పష్టంచేశారు. ఉరవకొండ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై కేశవ్‌ ఘాటుగా స్పందించారు. అనంతపురం తెదేపా కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ ఆసరా పథకం కింద నిధుల్ని విడుదల చేసినట్లు గొప్పగా ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబును, పత్రికల యజమానులను తిడుతూ... తనకు మీడియా లేదని చెబుతూ ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేయడం విడ్డూరం. తన ప్రభుత్వ పతనం తప్పదని తెలిసే జగన్‌ ఇలా బేలగా మాట్లాడుతున్నారు. రాయలసీమలో చుక్క నీటి కోసం ఆందోళన చేస్తున్న ప్రతిఒక్క రైతూ తెదేపాకు స్టార్‌ క్యాంపెయినరే. పంట నష్టం, బీమా పరిహారం అందని అన్నదాతలు, నష్టపోయిన నిరుద్యోగులు, ఉద్యోగులు, అంగన్‌వాడీలు, పోలీసులు, జే బ్రాండ్‌ మద్యంతో పుస్తెలు తెగిన మహిళలు, 27 పథకాల రద్దుతో నష్టపోయిన దళితులు, 37 పథకాల రద్దుతో అన్యాయమై పోయిన బీసీలు, ముస్లింలు... ఇలా అందరూ మా పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్లే’ అని పయ్యావుల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని