జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు

ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 19 Mar 2024 05:09 IST

పోలీసుల తీరుపై ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘సభలో ప్రధాని కూర్చున్న వేదిక వైపు జనం తోసుకువస్తుంటే పోలీసులకు నియంత్రించే బాధ్యత లేదా.. ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగానే సభకు అడ్డంకులు సృష్టించేందుకు యత్నించారు. స్వయంగా మోదీ కలగజేసుకుని స్తంభాలపైకి ఎక్కిన వారిని దిగాలని వారించడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని