ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్‌ హస్తం

ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్‌ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Published : 19 Mar 2024 05:06 IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ఈనాడు, అమరావతి: ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్‌ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. డీజీపీ, పోలీసు అధికారులు పక్షపాత వైఖరి మానుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో రవీంద్ర సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘చిలకలూరిపేటలో భారీగా జరిగిన ప్రజాగళం సభ విషయంలో పోలీసుల వైఖరి, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని హాజరయ్యే సభలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? ట్రాఫిక్‌ నియంత్రించాల్సిన పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపేయడమేంటి?’ అని కొల్లు రవీంద్ర నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని