రజత కళా తోరణం

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కరీంనగర్‌లో సిల్వర్‌ ఫిలిగ్రీతో తయారు

Published : 02 Jul 2022 06:15 IST

ప్రధాని మోదీకి కరీంనగర్‌ ఫిలిగ్రీ కానుక

ఈనాడు, కరీంనగర్‌ , న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కరీంనగర్‌లో సిల్వర్‌ ఫిలిగ్రీతో తయారు చేసిన కాకతీయ తోరణాన్ని కానుకగా అందించనున్నారు. ప్రధాని మోదీతోపాటు హోంశాఖ మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరో ఇద్దరు ముఖ్యనేతలకు ఈ కానుకలను ఇవ్వాలని భాజపా నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదేశాలతో ఆ పార్టీ నాయకులు వీటిని తయారు చేయించారు. మొత్తం ఐదు జ్ఞాపికల్ని కరీంనగర్‌ కళాకారులు రూపొందించారు. ఒక్కో దాని తయారీ కోసం 110 గ్రాముల వెండిని వినియోగించారు. సిల్వర్‌ ఫిలిగ్రీ ఆఫ్‌ కరీంనగర్‌ (సిఫ్కా) అధ్యక్షుడు ఎర్రోజు అశోక్‌తోపాటు ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్‌లు వీటిని సుందరంగా తీర్చిదిద్దారు. వెండి తీగలతో చూడముచ్చటగా రూపొందించిన వీటిని ప్రత్యేకమైన ఫొటో ఫ్రేమ్‌లలో అలంకరించారు. స్వీకర్తల ఫొటోలనూ వీటిలో అమర్చనున్నారని తెలిసింది. ఆయా నేతలకు బండి సంజయ్‌ వీటిని అందించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని